Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeNationalబెంగళూరు ఎయిర్ షో ప్రారంభం – వైమానిక విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి

బెంగళూరు ఎయిర్ షో ప్రారంభం – వైమానిక విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి

-

Chat on WhatsApp

బెంగళూరులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ప్రతిష్టాత్మక ఎయిర్ షో ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ ఫిబ్రవరి 14 వరకు కొనసాగనుంది.

ఈ ఎయిర్ షోలో 90 దేశాల నుంచి 150కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనలో సుమారు 900 వైమానిక విన్యాసాలు జరుగనున్నాయి. వాణిజ్య, యుద్ధ విమానాల నూతన నమూనాలు, అత్యాధునిక రక్షణ సాంకేతికతలు ప్రదర్శించబడుతున్నాయి.

అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ సహా అనేక దేశాల రక్షణ సంస్థలు పాల్గొన్నాయి. ఎఫ్-16, రాఫెల్, సుఖోయ్, మిరాజ్ వంటి యుద్ధ విమానాల విన్యాసాలు హైలైట్‌గా నిలవనున్నాయి. పౌర విమానయాన, రక్షణ రంగంలో ఉపయోగపడే అత్యాధునిక డ్రోన్లు, హెలికాప్టర్లు కూడా ప్రదర్శనలో ఉంచబడ్డాయి.

ఈ ఎయిర్ షో భారత్‌కి రక్షణ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే గొప్ప అవకాశంగా మారనుంది. భారత్‌లో తయారీదారులకు, అంతర్జాతీయ సంస్థలకు వేదికగా నిలుస్తున్న ఈ ప్రదర్శన దేశ వైమానిక శక్తిని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp