Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబ్రాహ్మణులకు ఆలయ పాలక మండలి సభ్యుల నియామకం

బ్రాహ్మణులకు ఆలయ పాలక మండలి సభ్యుల నియామకం

-

Chat on WhatsApp

చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆధ్వర్యంలో కాషాయ ధ్వజం ఆవిష్కరణ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయమూర్తి ఆముదం వెంకటేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం 100వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన మాట్లాడుతూ పంచ్ పరివర్తన పేరుతో గ్రామాలలో సమాజాన్ని రక్షించడానికి స్వయం సేవకులు కలవాలని ప్రోత్సహించారు.

వాతావరణ కాలుష్యాన్ని నివారించడం, గ్రామ వికాసం, గ్రామ స్వరాజ్యం కోసం పౌర విధులు నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలిపారు.

వన మహోత్సవం రక్షించడానికి, దేశం రక్షించుకోవడానికి స్వయంసేవక్ భాగం తీసుకోవాలని పేర్కొన్నారు.

దేశంలో 150 శాఖలు నడుస్తున్నాయని, 153 వేల శివ కేంద్రాలు, ఒక కోటి 50 లక్షల మంది స్వయం సేవకులు ఉన్నారని ఆయన వెల్లడించారు.

వ్యక్తి నిర్మాణం అనేది రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయించారు.

ఈ కార్యక్రమంలో రామానుజపురం ప్రభాకర్, సంజీవ్ గౌడ్, నాయిని ప్రవీణ్ కుమార్, దుర్గం నవీన్ గౌడ్, కుమ్మరి రాము, దుర్గం స్వామి గౌడ్, పుట్ట సాయిబాబా, స్వామి శ్రీనివాస్, షేరు స్వామి, నర్సింలు, రాజు మహేష్, మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో స్వయంసేవక గుణగణాలను పెంచుకోవడం, సామాజిక సమరసతను ప్రోత్సహించడం ముఖ్యమన్నారు.

వేదికపై చేసిన ప్రసంగంలో, ఆముదం వెంకటేశం భారతదేశం నందు సమాజం మరియు స్వయం సేవకుల పాత్ర ఎంత ముఖ్యమైందో వివరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp