Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల

ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల

-

Chat on WhatsApp

ఏపీలో ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్ 2024) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించారు. తాజాగా ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. నిజానికి ఈ నెల 2నే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా తుది కీ వెల్లడిలో ఆలస్యం కారణంగా నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా స్పందించారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్‌లో నిర్వహించిన టెట్-2024 ఫలితాలను ఈరోజు విడుదల చేసినట్టు పేర్కొన్నారు.

ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించినట్టు తెలిపారు. ఫలితాలను సిఎస్‌ఈ.ఎపీ.గోవ్.ఇన్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. టెట్ లో అర్హత సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp