Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadహైదరాబాద్ లో అఖిలభారత గౌడ సంఘం సమావేశం

హైదరాబాద్ లో అఖిలభారత గౌడ సంఘం సమావేశం

-

Chat on WhatsApp

హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో ఆదివారం అఖిలభారత గౌడ సంఘం సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీపతి నాయక్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మరియు బిసి మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బిసి సంఘ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల గౌడ సంఘ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో అఖిలభారత గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ మాట్లాడుతూ, గౌడ సంఘం తనంతా ఒక యూనిటీగా ఉండి, తమ హక్కుల కోసం అతి త్వరలో ఢిల్లీలో గౌడ గర్జన నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

పల్లె లక్ష్మణరావు గౌడ్ వేరే ప్రాంతాల్లోని గౌడ సంఘాలను కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ లో జరిగే గౌడ గర్జనలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన నిర్ధారణ చేశారు.

ఈ సమావేశంలో గౌడ సంఘం అభివృద్ధి కోసం చేయాల్సిన పనులను, ప్రభుత్వాలకు ఇచ్చే సూచనలను కూడా చర్చించడంతో, ఈ అంశాలు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp