Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeRangareddyLal Bahadur Nagaరంగారెడ్డిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

రంగారెడ్డిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి ఇన్చార్జి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కేఎల్ఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహేశ్వరం పట్టణంలో వారికి కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగతం అందించారు.

స్వాగత కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాలు, భారీ వాహన శ్రేణితో నగరం కదిలిపోయింది. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మార్కెట్ కమిటీలో అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చామనీ, బీఆర్ఎస్, బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరాదని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్లనే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని కేఎల్ఆర్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని, రైతుల భూముల త్యాగం వల్లనే యువతకు ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని తెలిపారు. వ్యవసాయం ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కమిటీ సభ్యులు గ్రామీణ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular