Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeNationalపహల్గామ్ దాడిపై అఫ్రిది-ధావన్ మాటల యుద్ధం

పహల్గామ్ దాడిపై అఫ్రిది-ధావన్ మాటల యుద్ధం

-

Chat on WhatsApp

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటన భారత్‌లో తీవ్ర ఆవేదనను రేకెత్తించింది. భారత భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సమయంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం మరింత ముదిరింది. భారత సైన్యంపై దుయ్యబట్టిన ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దీనికి భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గట్టిగా స్పందిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.

ఒక టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది మాట్లాడుతూ, “భారతదేశంలో 8 లక్షల మంది సైనికులు కశ్మీర్‌లో ఉన్నా ప్రజలను రక్షించలేకపోతున్నారు. దాడి జరగడం వాళ్ల వైఫల్యాన్ని సూచిస్తుంది. ఇది సైన్యం అసమర్థతను నలుగురికీ వెల్లడించింది” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత భద్రతా వ్యవస్థను విమర్శిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల మన్ననలు పొందలేదు.

ఈ వ్యాఖ్యలపై ధావన్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. “కార్గిల్‌లో ఓడించాం గుర్తుందా? ఇంకా ఎంత దిగజారుతారు? మీ దేశ అభివృద్ధిని చూసుకోండి. భారత సైన్యంపై మాకు గర్వంగా ఉంది. భారత్ మాతా కీ జై!” అంటూ ధావన్ హిందీలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ దేశవ్యాప్తంగా స్పందన కలిగించింది. ధావన్‌కి అభిమానుల నుంచి భారీ మద్దతు లభించింది.

అయితే అఫ్రిది ధావన్ ట్వీట్‌కు ప్రతిస్పందిస్తూ తాను విమర్శలకంటే శాంతియుత పరిష్కారాలకే మద్దతుగా ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశాడు. “గెలుపోటములు పక్కన పెడితే, రా శిఖర్ నీకు ఛాయ్ తాగిస్తాను” అని ట్వీట్ చేశాడు. అయితే అఫ్రిది సమాధానం కూడా మిమిక్రీ తరహాలోనే ఉండటంతో మరోసారి విమర్శల బాట పట్టింది. ఈ మార్పిడి ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను సోషల్ మీడియాలో మరింతగా ప్రతిబింబించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp