Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeInterNationalఒడీస్‌కు గుడ్‌బై చెప్పనున్న ఆఫ్ఘనిస్థాన్ స్టార్ మహ్మద్ నబీ

ఒడీస్‌కు గుడ్‌బై చెప్పనున్న ఆఫ్ఘనిస్థాన్ స్టార్ మహ్మద్ నబీ

ఆఫ్ఘ‌నిస్థాన్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మహ్మద్ నబీ వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నాడు. పాకిస్థాన్ వేదిక‌గా 2025లో జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డే క్రికెట్ నుంచి వైదొలగనున్నట్లు నబీ ప్రకటించాడు. ఈ విషయం గురించి ఇప్పటికే ఆఫ్ఘ‌నిస్థాన్ క్రికెట్ బోర్డుకు నబీ తెలియజేశాడు, అతని నిర్ణయాన్ని బోర్డు గౌరవిస్తుందని బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నసీబ్ ఖాన్ వెల్లడించాడు.

మహ్మద్ నబీ, 39 ఏళ్ల వయసులో, 2009లో వన్డే క్రికెట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. తన 15 ఏళ్ల కెరీర్‌లో ఆఫ్ఘనిస్థాన్ తరపున 165 వన్డేలు ఆడిన నబీ, 3,537 పరుగులు చేయడమే కాకుండా 171 వికెట్లు కూడా తీశాడు. ఈ ఘనతలతో నబీ తన దేశం తరపున ముఖ్యమైన పాత్ర పోషించాడు.

మహ్మద్ నబీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డేలను వీడుతున్నా, అతను పొట్టి ఫార్మాట్లలో కొనసాగుతాడని నసీబ్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular