Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeOthersపాంటింగ్ వ్యాఖ్యలకు గంభీర్ గట్టి సమాధానం

పాంటింగ్ వ్యాఖ్యలకు గంభీర్ గట్టి సమాధానం

-

Chat on WhatsApp

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టు రెండవ బృందం ఇవాళ (సోమవారం) ఆస్ట్రేలియా బయలుదేరనున్న నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై విమర్శల గురించి ప్రశ్నించిన మీడియాకు గంభీర్ కుండబద్ధలు కొట్టినట్లు సమాధానం ఇచ్చాడు. కోహ్లీ పేలవ ఫామ్‌లో ఉన్నాడంటూ ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను గంభీర్ ఖండిస్తూ, “ఆస్ట్రేలియా క్రికెట్ గురించి పాంటింగ్ ఆలోచించాలి, భారత క్రికెట్ గురించి కాదు” అని స్పష్టం చేశాడు.

తొలి టెస్ట్‌కు రోహిత్ దూరమవుతుండగా, పెర్త్ వేదికగా జరగబోయే ఆ టెస్ట్ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని గంభీర్ వెల్లడించాడు. రోహిత్, కోహ్లీ గురించి వస్తున్న వదంతులను కొట్టి పారేస్తూ, ఉన్న జట్టుతోనే విజయాలు సాధించే విశ్వాసం వ్యక్తం చేశాడు. వాషింగ్టన్ సుందర్ ఎంపిక గురించి మాట్లాడుతూ, తదుపరి తరం ఆటగాళ్లు జట్టులోకి రాకను సూచించారని చెప్పాడు.

ఆస్ట్రేలియాలో పిచ్‌లు ఎలా ఉంటాయో చెప్పలేమని గంభీర్ అన్నాడు, కానీ రానున్న 10 రోజులు ప్రాక్టీస్ చేయడం కీలకమని పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ బలంగా ఉన్నాడని, ఓపెనర్‌గా మొదలవ్వగలడని, కావాలనుకుంటే 6వ స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడని పేర్కొన్నాడు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp