నెల్లూరు జిల్లా సంగం మండలం కెనరా బ్యాంక్ సమీపం లో రహదారి పై మురుగు నీరు చేరి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ వేమారెడ్డి సోమవారం తన సొంత పనిగా భావించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా పలుమార్లు వాహనదారులు ప్రజలు ఈ సమస్యను స్థానిక సీఐ వేమారెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సీఐ వేమారెడ్డి మానవత్వం తో స్పందించి స్థానికుల సహాయం తో మురుగు నీటి తొలగింపుకు శ్రీకారం చుట్టారు.రహదారి పై దగ్గరుండి జేసిబి సహాయం తో రహదారి పక్కనే కాలువ తీయించి మురుగునీటిని అంతా తొలగించారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రజలు, వాహనదారులు సీఐ. వేమారెడ్డికి సెల్యూట్ కొడుతున్నారు. ఆయనకు ప్రజల నుంచి ప్రశంసలు, దీవెనలు అందుకున్నారు.దీంతో వాహనదారులు ,ప్రయాణికులు సంగం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ అధికారులు అంటే కేవలం అధికారం చెలయించటమే కాకుండా ప్రజలకు సేవ చేసే అధికారులు ఇలాంటి అధికారులు కావాలని, ఇలాంటి అధికారుల వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపి సీఐ వేమారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.








