Friday, July 17, 2026
Chat on WhatsApp
HomeTelanganaPeddapalliహనుమాన్ నగర్‌లో వినయ్ కుమార్ హత్య

హనుమాన్ నగర్‌లో వినయ్ కుమార్ హత్య

-

Chat on WhatsApp

8ఇంక్లైన్ కాలనీలోని హనుమాన్ నగర్ కు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు.

గోదావరిఖనికి చెందిన వివాహితతో ప్రేమ వ్యవహారమే వినయ్ హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది, వినయ్ కుమార్ గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో స్కావేంజర్ గా పనిచేస్తున్నాడు.

గోదావరిఖనికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితతో కొంతకాలంగా మృతుడు ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు..ఈ క్రమం లో సదరు వివాహితను మూడు నెలల క్రితం వినయ్ గుడిలో పెళ్లి చేసుకున్నాడు.

కుటుంబ సభ్యులు వివాహాన్ని అంగీకరించక పోవడంతో స్థానిక 8 ఇంక్లైన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వివాహిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించ డంతో ఇద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన ఇద్దరిలో మార్పు రాకపోవడంతో…

ఈ క్రమంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా గురువారం సాయంత్రం 8 ఇంక్లైన్ కాలనీకి మృతుడు వినయ్ కుమార్ వెళ్లాడు. పక్కా పథకం ప్రకారం సదరు వివాహిత భర్త తమ్ముడు కలిసి హత్య చేశారు.

సమాచారం అందుకున్న గోదావరిఖని ఏసీపీ, స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపు తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Crowd at Puri Jagannath Rath Yatra after a stampede incident in Odisha

Puri Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. 120 మందికి పైగా...

ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ...
- Advertisement -
Chat on WhatsApp