Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeBhadradriAswaraopeta(ST)పామాయిల్ ఫ్యాక్టరీ లో 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

పామాయిల్ ఫ్యాక్టరీ లో 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం

-

Chat on WhatsApp

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ లో నూతనంగా నిర్మించిన 2.5 మెగా వాట్ పవర్ ప్లాంట్ ఈనెల 12వ తేదీన ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పవర్ ప్లాంట్ ను సందర్శించారు.

విజయదశమి రోజు నూతనంగా ఏర్పాటుచేసిన పవర్ ప్లాంట్ ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సమస్యలు కారణంగా పామాయిల్ ఫ్యాక్టరీ క్రషింగ్ కు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం 36 కోట్లతో నూతన పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని,రైతులకు పవర్ ప్లాంట్ నిర్మాణం శుభ పరిణామంగా చెప్పుకోవాలని కలెక్టర్ అన్నారు.

విజయదశమి రోజు రైతులందరూ తమ ఇంట్లో పండుగ జరుపుకోవాలని భావిస్తారని, కానీ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా రైతులందరూ పామాయిల్ ఫ్యాక్టరీ కి వచ్చి తమతోపాటు నూతన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

krishna mohan appointed interim general secretary of ayodhya ram mandir trust

అయోధ్య రామ మందిర ట్రస్ట్‌లో కీలక మార్పు.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరంటే ?

Ayodhya Ram Mandir Trust: రామ మందిర విరాళాల లెక్కలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక బాధ్యతల్లో మార్పులు చేపట్టింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్...
- Advertisement -
Chat on WhatsApp