Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIనర్సీపట్నం ఏరియా ఆసుపత్రి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి పర్యటనలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు

-

Chat on WhatsApp

నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఏరియా ఆస్పత్రిలో వార్డులలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.

రోగులకు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ తో కలిసి అన్నా క్యాంటీన్ ప్రారంభించి అక్కడే భోజనాలు చేశారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేయబడినవి, అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ క్యాంటిన్లను నిలిపివేసింది.

ఈ అన్న క్యాంటిన్ నిర్వహణ బాధ్యతలు హరేరామ హరికృష్ణ సంస్థ చేపట్టినట్లు తెలిపారు.గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు నిలిపివేయడంతో స్వంత నిధులతోనే అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో చింతకాయల పద్మవతి, రెండు రూపాయలకే అన్న క్యాంటిన్ నిర్వహించారన్నారు.

ప్రతి నియోజకవర్గంలో పేదవారి కోసం అన్న క్యాంటిన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

ఈ క్యాంటిన్లు పేదవారి కోసం ప్రత్యేకంగా నిర్వహించబడుతున్నాయని, ప్రతి రోజు ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అయ్యన్న సతీమణి చింతకాయల పద్మవతి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, జనసేన ఇన్‌చార్జి సూర్యచంద్ర, ఆర్డీవో జయరామ్, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp