Saturday, July 18, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedchal Malkajgiriఉప్పల్ వాయి గ్రామానికి బస్సు సేవలను పునరుద్ధరించాలంటూ ధర్నా

ఉప్పల్ వాయి గ్రామానికి బస్సు సేవలను పునరుద్ధరించాలంటూ ధర్నా

-

Chat on WhatsApp

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్ వాయి గ్రామస్తులు కొత్త బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నా ద్వారా గ్రామానికి బస్సు సేవలు అందించాలంటూ వారు తీవ్రంగా డిమాండ్ చేశారు.

గ్రామస్తులు ప్రసన్న, దాసరి పోషవ్వ, పల్లె. సుగుణ, కోరాడి లక్ష్మి, ఆస్మా మాట్లాడుతూ, తమ గ్రామానికి బస్సు రాకపోవడం బాధాకరమని చెప్పారు.

గత పది నెలలుగా గ్రామానికి బస్సు రాకపోవడం వలన మహిళలు అధార్ కార్డు ఉన్నా కూడా ప్రయాణం చేయలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పండగల సమయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని, గ్రామ ప్రజలు తీవ్రంగా అలసిపోయారని గ్రామస్తులు తెలిపారు.

ఉప్పల్ వాయి గ్రామానికి చెందిన ప్రజలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు గారికి కామారెడ్డి డిపో మేనేజర్ తో మాట్లాడి, రేపటినుండి బస్సు సేవలను పునరుద్ధరించాలంటూ అభ్యర్థించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో గంగాధర్, విక్కి, రాము, అనసూయ, సాయవ్వ, పద్మ, పుతిలిబి, అన్వర్, షబానా మరియు ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు తమ సమస్యకు పరిష్కారం కావాలని, బస్సు సేవలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Indus Waters Treaty arbitration dispute between India and Pakistan

Indus Waters Treaty | భారత్ ఇచ్చిన షాక్‌కు పాక్ విలవిల, సింధు వివాదం.. భారత్...

Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ వివాదంలో పాకిస్థాన్‌కు ఆర్థిక భారం పెరుగుతోంది. భారత్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండటంతో, విచారణ నిర్వహణకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp