Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeTelanganaMedakనిజాంపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

నిజాంపేట మండలంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

-

నిజాంపేట మండల వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో సురేష్ కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో రాజిరెడ్డి జెండాను ఆవిష్కరించారు.

1948 సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చినందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామని అధికారులతో పాటు గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఏఎస్ఐ జయపాల్ రెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వినియ్, గ్రామ కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ వద్ద నిర్వహించిన వేడుకలు ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించాయి.

అధికారులు మాట్లాడుతూ ఈ వేడుకలు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమే అని అన్నారు.

గ్రామస్తులు, అధికారులు పాల్గొన్న ఈ వేడుకలు పల్లె ప్రజలకు జాతీయ జెండా అంటే గౌరవం పెంచాయి.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది కూడా జాతీయ గీతాలు పాడి ప్రదర్శనలు ఇచ్చారు.

- Advertisement -
- Advertisment -

Must Read

Gaddar Film Awards 2026

Gaddar Film Awards 2026 | గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో మెరిసిన తారలు 

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో సినీ తారలు మెరిసిపోయారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమం స్టార్ గ్లామర్‌తో కాంతివంతమైంది. ప్రముఖ నటీనటులు, దర్శకులు, హాజరై...