Wednesday, April 1, 2026
Chat on WhatsApp
HomeOthers9 క్యారెట్ల బంగారంఫై కేంద్రం కీలక నిర్ణయం

9 క్యారెట్ల బంగారంఫై కేంద్రం కీలక నిర్ణయం

-

Chat on WhatsApp

ప్రస్తుతం బంగారం ధరలు రూ. 70 వేలకు అటూఇటుగా కొనసాగుతున్నాయి. దీంతో అటువైపు చూడాలంటేనే మగువలు భయపడుతున్నారు. అంతేకాదు, బంగారం చోరీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో, నగలు వేసుకుని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. 

దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై 9 కేరెట్ల బంగారాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు బంగారు నగల వ్యాపారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. 

నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం 2021తో పోలిస్తే 2022లో దేశంలో గొలుసు దొంగతనాలు 32.54 శాతం పెరిగాయి. దీంతో నగలు వేసుకుని దొంగలకు ముట్టజెప్పడం దేనికన్న ఆలోచనతో చవక బంగారంపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కేంద్రం 9 క్యారెట్ల బంగారం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసింది. 9 కేరెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 20 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ బంగారంపైనా దాని నాణ్యతలను ధ్రువీకరించే హాల్‌మార్క్ ఉంటుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Amaravati Bill approved in Lok Sabha; CM Chandrababu Naidu comments on Andhra Pradesh capital.

Amaravati Bill | అమరావతినే ఏకైక రాజధాని…బిల్లుకు లోక్ సభ ఆమోదం

Amaravati Bill: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధ హోదా ఇవ్వడం కోసం లోక్‌సభలో అమరావతి చట్టబద్దత బిల్ ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తిస్తుంది....
- Advertisement -
Chat on WhatsApp