Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTechnology NewsMaruti Suzuki Brezza | బ్రెజ్జా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో రానున్న...

Maruti Suzuki Brezza | బ్రెజ్జా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లతో రానున్న SUV

-

Chat on WhatsApp

Maruti Suzuki Brezza: భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన మారుతి సుజుకి బ్రెజ్జా త్వరలోనే కొత్త రూపంలో వినియోగదారుల ముందుకు రానుంది. కంపెనీ 2026 జూలై 23న ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు ఆటో రంగంలో ప్రచారం జరుగుతోంది.

ఈసారి కేవలం బాహ్య డిజైన్ మాత్రమే కాకుండా ఇంజిన్, ఫీచర్లు, క్యాబిన్ నాణ్యత వంటి అంశాల్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం. కొత్త బ్రెజ్జాలో తొలిసారిగా టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉందని ఆటో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఫ్రాంక్స్‌లో ఉపయోగిస్తున్న 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో ఇంజిన్‌ను ఈ మోడల్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఈ ఇంజిన్ మెరుగైన పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని అందించడంతో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతకానున్నట్లు అంచనా వేస్తున్నారు. చిన్న సామర్థ్యం గల ఇంజిన్ కారణంగా తక్కువ జీఎస్టీ ప్రయోజనం కూడా కంపెనీకి లభించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఫీచర్ల పరంగా కూడా బ్రెజ్జా మరింత ప్రీమియం అనుభూతిని అందించనుంది. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అంబియంట్ లైటింగ్, ముందు పార్కింగ్ సెన్సర్లు వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

అలాగే లెవల్-2 ADAS వంటి ఆధునిక భద్రతా సాంకేతికతను కూడా జోడించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా కొనసాగించే అవకాశం ఉంది. అండర్‌బాడీ సీఎన్‌జీ ట్యాంక్‌ను ఉపయోగించడం వల్ల బూట్ స్పేస్ పెరిగే అవకాశం ఉందని సమాచారం.

బయట డిజైన్‌లో కొత్త గ్రిల్, హెడ్‌ల్యాంప్స్, బంపర్లు, అప్‌డేటెడ్ అలాయ్ వీల్స్ వంటి మార్పులు కనిపించే అవకాశముంది. కొత్త ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ కారణంగా బ్రెజ్జా ధర ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొంత పెరిగే అవకాశం ఉంది. విడుదల అనంతరం ఈ SUV, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp