Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeNationalBombay High Court | తప్పుడు ప్రచారంపై కోర్టు మెట్లు ఎక్కిన నితిన్ గడ్కరీ.. సోషల్...

Bombay High Court | తప్పుడు ప్రచారంపై కోర్టు మెట్లు ఎక్కిన నితిన్ గడ్కరీ.. సోషల్ మీడియాపై చర్యలకు అనుమతి?

-

Chat on WhatsApp

సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Bombay High Court) బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ విధానం వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడుతున్నారంటూ డీప్‌ఫేక్ ఫొటోలు, వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆయన కోర్టుకు వివరించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. గడ్కరీ తన పిటిషన్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు.

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఈ20 ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందని, ఆ విధాన రూపకల్పన లేదా అమలులో తనకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా తనను లక్ష్యంగా చేసుకుని అసత్య సమాచారాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే పోస్టులను ప్రచారం చేసిన మెటా, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సంబంధిత నిర్వాహకులపై సివిల్ దావా వేయేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు.

పిటిషన్‌ను పరిశీలించిన బొంబాయి హైకోర్టు ఆయన అభ్యర్థనకు అనుమతి మంజూరు చేసింది. తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ కంటెంట్‌పై చట్టపరమైన పోరాటానికి ఈ నిర్ణయం కీలకంగా మారగా, సోషల్ మీడియా వేదికల్లో అసత్య ప్రచారం చేసే వారిపై మరింత బాధ్యత పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp