Friday, July 3, 2026
Chat on WhatsApp
HomeInterNationalVenezuela | శిథిలాల కింద 8 రోజులు.. సజీవంగా బయటపడిన సెక్యూరిటీ గార్డు

Venezuela | శిథిలాల కింద 8 రోజులు.. సజీవంగా బయటపడిన సెక్యూరిటీ గార్డు

-

Chat on WhatsApp

Venezuela: వెనిజులాలో ఇటీవల సంభవించిన భారీ భూకంపం వేలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. అనేక ప్రాణనష్టాలు, భారీ ఆస్తి నష్టం మధ్య ప్రపంచాన్ని కదిలించిన ఓ అద్భుత ఘటన వెలుగులోకి వచ్చింది. భవనం శిథిలాల కింద వరుసగా ఎనిమిది రోజుల పాటు చిక్కుకుపోయిన 43 ఏళ్ల సెక్యూరిటీ గార్డు హెర్నాన్ ఆల్బెర్టో గిల్ ఫ్లోర్స్ చివరకు సజీవంగా బయటపడటంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

లా గువైరా ప్రాంతంలోని గలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ సెంటర్‌లో రాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోవడంతో హెర్నాన్ శిథిలాల మధ్య చిక్కుకున్నాడు. అయితే అతను ఉన్న సెక్యూరిటీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాకపోవడంతో చిన్న గాలి ఖాళీ ఏర్పడింది. అదే అతని ప్రాణాలను ఎనిమిది రోజుల పాటు నిలబెట్టిందని సహాయక బృందాలు వెల్లడించాయి.

హెర్నాన్ కోసం స్థానిక బృందాలతో పాటు పలు దేశాల నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణులు దాదాపు 100 గంటల పాటు నిరంతరం శ్రమించారు. ప్రత్యేక కెమెరాలు, శబ్దాలను గుర్తించే పరికరాల సహాయంతో అతని స్థానాన్ని గుర్తించి అత్యంత జాగ్రత్తగా శిథిలాలను తొలగించారు. ఇరుకైన మార్గం ద్వారా నీరు, ద్రవ ఆహారం అందిస్తూ అతడిని ప్రాణాలతో ఉంచగలిగారు. చివరకు స్ట్రెచర్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో బయటకు తీసుకొస్తుండగా అక్కడున్న వారంతా చప్పట్లతో స్వాగతం పలికారు. రెస్క్యూ బృందాల వివరాల ప్రకారం, తన భార్య తాను మరణించానని భావిస్తోందని, తాను సురక్షితంగా ఉన్నానని వెంటనే చెప్పవద్దని హెర్నాన్ కోరినట్లు తెలిపారు.

అనంతరం అతడు ప్రాణాలతో బయటపడ్డాడనే సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇద్దరు చిన్నారులకు తండ్రైన హెర్నాన్ కోలుకుంటుండటంతో వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. జూన్ 24న సంభవించిన భారీ భూకంపాల వల్ల వెనిజులాలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది భవనాలు కూలిపోగా, భారీ ప్రాణనష్టం సంభవించింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా, శిథిలాల మధ్య నుంచి హెర్నాన్ సజీవంగా బయటపడటం విపత్తు మధ్య ఆశను నింపిన అరుదైన ఘటనగా నిలిచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

chandrababu naidu launches jsw rayalaseema steel plant in kadapa district

CM Chandrababu Naidu | రాయలసీమను ‘ఉక్కుసీమ’గా మారుస్తాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu Naidu: పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఉక్కు పరిశ్రమలకు కీలక గమ్యస్థానంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో...
- Advertisement -
Chat on WhatsApp