Sakshi Dhoni Watch: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్–ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోనీ భార్య సాక్షీ ధోనీ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రేక్షకుల గ్యాలరీలో ఉత్సాహంగా మ్యాచ్ను వీక్షించిన ఆమె స్టైల్ మరియు లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఫ్లోరల్ ప్రింట్ ఉన్న క్రీమ్ కలర్ డ్రెస్సులో కనిపించిన సాక్షీ ధోనీ, తన చేతికి ధరించిన లగ్జరీ వాచ్ కారణంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ధరించినది ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ రిచర్డ్ మిల్లి ఆర్ఎం 67-02 మోడల్ వాచ్ అని తెలుస్తోంది. దీని విలువ సుమారు 3.1 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం.
ఈ వాచ్ను అత్యంత తేలికపాటి డిజైన్తో, ఆధునిక ఇంజనీరింగ్ టెక్నాలజీతో తయారు చేశారు. సౌతాఫ్రికా ఒలింపిక్ అథ్లెట్ వేడీ వాన్ నీకెర్క్ సహకారంతో రూపొందించిన ఈ మోడల్ను ప్రత్యేకంగా స్పోర్ట్స్ పర్సనాలిటీలు, హై-పర్ఫార్మెన్స్ యూజర్ల కోసం డిజైన్ చేశారు. క్వార్ట్జ్ టీపిటీ మెటీరియల్తో తయారైన ఈ వాచ్ షాక్ రెసిస్టెంట్గా ఉంటుంది.
ముంబై మ్యాచ్ సమయంలో కెమెరా లెన్స్లో ఆమె వాచ్ స్పష్టంగా కనిపించడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్గా మారింది. స్టైలిష్ డ్రెస్సింగ్తో పాటు లగ్జరీ వాచ్ ధరించడం ద్వారా సాక్షీ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు.








