Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీ రాములవారి కల్యాణానికి..1.60 లక్షల తలంబ్రాలు సిద్ధం

శ్రీ రాములవారి కల్యాణానికి..1.60 లక్షల తలంబ్రాలు సిద్ధం

-

Chat on WhatsApp

ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి(Ontimitta Sri Kodandarama Swamy) ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమై, వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి ఘనంగా ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు.

ఏప్రిల్ 1వ రాత్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణం జరగనుండగా, దీనికి టీటీడీ శాస్త్రోక్తంగా తలంబ్రాలను తయారు చేసింది.

ఈ క్రమంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తలంబ్రాలను కల్యాణ వేదిక వద్ద గల పిఏసి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కల్యాణానికి ఉపయోగించే పసుపును మార్చి 25న దంచే కార్యక్రమం జరిగింది.

ఆలయ హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేయబడ్డాయి. ఒక్కో ప్యాకెట్‌లో ఒక ముత్యం, ఒక కంకణం ఉంచి 1.60 లక్షల ప్యాకెట్లుగా సిద్ధం చేశారు.

దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని, శాస్త్రోక్తంగా ఉత్సవాలను నిర్వహించడంలో సహకరించారు. టీటీడీ ద్వారా ఈ పద్ధతిలో తలంబ్రాల తయారీ, ప్యాకింగ్ కార్యక్రమం ప్రతి ఏడాది పుణ్యమయంగా నిర్వహించబడుతూ, భక్తులకు స్మరణీయ అనుభూతిని అందిస్తుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deepfake video targeting telangana minister sridhar babu and ias officer shailaja ramaiyer

Minister Sridhar Babu | మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై డీప్‌ఫేక్ వీడియో కలకలం.....

తెలంగాణలో డీప్‌ఫేక్ టెక్నాలజీ దుర్వినియోగానికి సంబంధించిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu), ఆయన సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి...
- Advertisement -
Chat on WhatsApp