HomeAndhra PradeshPrathipadu |అదుపుతప్పి  బైక్ కాలువలోకి...ఇద్దరు యువకులు గల్లంతు

Prathipadu |అదుపుతప్పి  బైక్ కాలువలోకి…ఇద్దరు యువకులు గల్లంతు

-

Chat on WhatsApp

Prathipadu: కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సి. రాయవరం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలేరు ఎడమ కాలువ వద్ద బైక్ అదుపుతప్పి నీటిలోకి దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.

స్థానికుల సమాచారం మేరకు బైక్‌తో ప్రయాణిస్తున్న యువకులు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో నేరుగా కాలువలో పడిపోయారు. దీంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.

ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్థానికులు మరియు పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఈ క్రమంలో ఒక యువకుడిని కాలువలో నుంచి బయటకు తీశారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది.

ఇంకా ఒక యువకుడు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. అతని ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు కలిసి కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp