Sunday, August 2, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం

ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం

-

Chat on WhatsApp

AP minister PA harassment case: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద అనధికార పీఏగా పనిచేస్తున్న సతీష్‌పై వచ్చిన వేధింపుల ఆరోపణలపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వెంటనే స్పందించింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ సతీష్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో, విషయం సీఎం కార్యాలయ దృష్టికి వెళ్లింది.

దీనిపై సీఎంవో వెంటనే చర్యలు తీసుకుంటూ సతీష్‌ను ఆయన పదవి నుండి తక్షణమే తొలగించాలని ఆదేశించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ అతడు విధుల్లో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ALSO READ:TTD Laddu Ghee Adulteration | సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో పెద్ద కుంభకోణం

ఇక సంబంధిత పోలీసు అధికారులకు సతీష్‌పై కేసు నమోదు చేయాలని సూచనలు జారీ చేసింది. బాధితురాలి ఫిర్యాదును పూర్తిగా విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎంవో పేర్కొంది. అదే సమయంలో ఆరోపణల వాస్తవికతను నిర్థారించేందుకు రెండు వైపులా సమగ్ర విచారణ అవసరమని సూచించింది.

విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవాస్తవమైతే తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. ప్రభుత్వ పదవుల్లో పనిచేస్తున్న వ్యక్తులపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే తక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని అధికారులు వెల్లడించారు. సంఘటన నిజానిజాలు వెలుగులోకి రావడానికి విచారణ కీలకమని అధికారులు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp