Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeNewsTMT Telescope Project: విశ్వ రహస్యాల పరిశోధనలో భారత్–జపాన్ సరికొత్త ముందడుగు  

TMT Telescope Project: విశ్వ రహస్యాల పరిశోధనలో భారత్–జపాన్ సరికొత్త ముందడుగు  

-

Chat on WhatsApp

విశ్వంలోని రహస్యాలను ఛేదించేందుకు రూపొందుతున్న థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) ప్రాజెక్టులో జపాన్‌తో కలిసి భారత్ కూడా కీలక భాగస్వామిగా చేరింది. సుమారు 30 మీటర్ల వ్యాసం కలిగిన ప్రైమరీ మిర్రర్‌తో నిర్మించనున్న ఈ టెలిస్కోప్‌లో మొత్తం 492 హెక్సాగోనల్ అద్దాలు ఉపయోగించబడనున్నాయి.

ALSO READ:Akhanda 2 Pre Release Event | అఖండ 2′ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

ఇవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆప్టికల్–ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌లలో ఒకటిగా నిలుస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ టీఎంటీ ద్వారా సుదూర నక్షత్రాలు, గెలాక్సీలు, ఎక్సోప్లానెట్ల అధ్యయనం మరింత ఖచ్చితంగా జరగనున్నది. ముఖ్యంగా, గ్రహాంతర జీవం ఉనికిని గుర్తించే పరిశోధనలకు ఇది కొత్త దిశ చూపే అవకాశం ఉంది.

జపాన్ శాస్త్రవేత్తలు 40 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి పంపిన రేడియో సందేశాలకు ప్రతిస్పందన కోసం ఈ టెలిస్కోప్ ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. హ్యోగో యూనివర్సిటీ బృందం నేతృత్వంలో ఈ పరిశోధనలు పునరుద్ధరించబడుతున్నాయి.

భారత్‌లోని లడఖ్ హాన్లే ప్రాంతాన్ని టెలిస్కోప్ స్థాపనకు పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భారత్, జపాన్‌తో పాటు అమెరికా, కెనడా, చైనా కూడా భాగస్వాములు కానున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp