తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ బదిలీలు జరిగాయి. ప్రభుత్వం మొత్తం “32 మంది IPS” అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కీలక విభాగాల్లో ఉన్న పలువురు అధికారులకు కొత్త బాధ్యతలను అప్పగించింది.
ALSO READ:Nagarjuna Sagar–Srisailam Launch | రేపటి నుంచి లాంచ్ సర్వీసులు పునఃప్రారంభం
ఇదిగో వివరాలు:
నార్కొటిక్ ఎస్పీగా పద్మ నియమితులయ్యారు. సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ ఖార్గేను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా వైభవ్ గైక్వాడ్ను పోస్టింగ్ ఇచ్చారు. సీఐడీ డీజీగా పరిమళ నూతన్ నియామకం జరిగింది. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా ఎం.చేతన బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రంలో చట్టవ్యవస్థ బలోపేతం, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ దృష్ట్యా ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్తగా నియమితులైన అధికారులు త్వరలోనే తమ పదవులను చేపట్టనున్నారు.









