దేశంలో కరోనా మళ్లీ తలెత్తుతోంది. కొద్దిరోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండగా, తాజాగా యాక్టివ్ కేసులు 5,300కు పైగా చేరాయి. ఇది ఆరోగ్య అధికారులను, ప్రజలను మరల అప్రమత్తం చేస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా వందల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు మాస్క్ ధరించటం, సామాజిక దూరం పాటించటం మళ్లీ ప్రారంభించాలని సూచనలు జారీ అయ్యాయి. పిల్లలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు. ఇటీవల వాతావరణ మార్పులు, కొత్త వేరియంట్ల ఉనికి, మరియు పబ్లిక్లో నిర్లక్ష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు.వైద్య నిపుణులు ప్రజలను అలర్ట్లో ఉండాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే, గత అనుభవం, మెరుగైన వైద్య వసతులతో సమర్థంగా ఎదుర్కోవచ్చు.
“భారత్లో మళ్లీ కరోనా కలకలం – యాక్టివ్ కేసులు 5,300 నమోదు ”
