Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedchal Malkajgiriఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ భద్రత కట్టుదిట్టం

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ భద్రత కట్టుదిట్టం

-

Chat on WhatsApp

టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీలు మార్చి 23న ప్రారంభం కానుండగా, ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్టేడియం పరిసరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియం భద్రత కోసం సుమారు 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అన్ని పోలీస్ విభాగాల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

ప్రేక్షకులు ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, పదునైన వస్తువులు, తినుబండారాలు, వాటర్ బాటిల్స్ తీసుకురాకూడదని స్పష్టం చేశారు. స్టేడియంలోకి ఈ వస్తువులను అనుమతించరాదని, భద్రతా అధికారులకు తగిన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

క్రికెట్ అభిమానుల రవాణా సౌలభ్యం కోసం మెట్రో రైలు సేవలు రాత్రిపూట ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని, ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకునేందుకు వీలైనన్ని మంది మెట్రో సేవలు వినియోగించుకోవాలని రాచకొండ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp