Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించిన మంత్రి ఆనం

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించిన మంత్రి ఆనం

-

Chat on WhatsApp

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో మంత్రిని ఆలయ రీతిపద్ధతిన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించారు.

ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, సుదర్శన హోమం నిర్వహించారు. వేద పండితుల ద్వారా వేదాశీర్వాదం అందించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహుదూర్ మంత్రికి నూతన వస్త్రాలు అందజేశారు. ఆలయ అభివృద్ధిపై మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు.

అలాగే డీసీ రమేష్ బాబు, అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. ఇంజనీర్ కోనేరు ఆలయ నిర్మాణ పరిపాలనను పరిశీలించి అవసరమైన మార్పులు సూచించారు. ఆలయ అభివృద్ధికి మరింత నిధుల కేటాయింపుపై మంత్రికి భక్తులు వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు, స్థానిక నాయకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కోసం ఆలయ పరిపాలన మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. భక్తుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఆలయ పాలక మండలి కృషి చేస్తుందని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp