Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshమహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో 2కె రన్

మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో 2కె రన్

-

Chat on WhatsApp

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీకి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం కలెక్టర్ మానవహారం ఏర్పాటు చేసి, అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మహిళల పట్ల గౌరవంతో మెలగాలని, సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మహిళల హక్కులు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

కార్యక్రమంలో ఐటీడిఏ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి డా. టి. కనకదుర్గ, జిల్లా విద్యాశాఖాధికారి డా. ఎస్. తిరుపతి నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డా. టి. జగన్మోహనరావు పాల్గొన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, మహిళా సాధికారత కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, స్వచ్చంద సంస్థలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని మహిళా సాధికారతకు మద్దతుగా నినాదాలు చేశారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, మహిళా హక్కులను మరింత పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

search operation for six missing fishermen called off off visakhapatnam coast

Visakhapatnam | మత్స్యకారుల జాడ కోసం నాలుగు రోజుల అన్వేషణ.. చివరికి?

Visakhapatnam: విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం చేపట్టిన గాలింపు చర్యలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. నాలుగు రోజుల పాటు నిరంతరంగా సాగిన అన్వేషణ అనంతరం ఇండియన్ నేవీ, కోస్ట్...
- Advertisement -
Chat on WhatsApp