Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeSangareddySangareddyఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమారుడు – తెల్లాపూర్ లో విషాదం

ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమారుడు – తెల్లాపూర్ లో విషాదం

-

Chat on WhatsApp

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని డివినోస్ విల్లాస్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తాగుడుకు బానిసైన కార్తీక్ రెడ్డి (26) తరచూ కుటుంబ సభ్యులతో ఆస్తి కోసం గొడవపడేవాడు. ఈ రోజు తెల్లవారుజామున తల్లి రాధిక (52)తో తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆవేశంలో కార్తీక్ కత్తితో ఆమెపై దాడి చేసినట్టు సమాచారం.

తన కుమారుని దాడిలో తీవ్రంగా గాయపడిన రాధిక రక్తపు మడుగుల్లో పడిపోయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను నల్లగండ్లలోని సిటిజెన్ ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర రక్తస్రావంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటన కుటుంబ సభ్యులను విషాదంలో ముంచేసింది.

సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడైన కార్తీక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాగుడుకు బానిసై, ఆస్తి కోసం తల్లినే హత్య చేయడం పట్ల గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఇంత దారుణంగా మారటం బాధకరమని, కార్తీక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp