Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబి కోడూరు టీచర్‌కు కారు ముఠా మోసం

బి కోడూరు టీచర్‌కు కారు ముఠా మోసం

-

Chat on WhatsApp

కడప జిల్లా బి కోడూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి సోమవారం సాయంత్రం మోసపోయారు. స్కూల్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, గుర్తుతెలియని వ్యక్తులు కారు ఆపి, తమ కారులో ఎక్కించుకున్నారు.

కొంతదూరం వెళ్లిన తర్వాత వారి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో వరలక్ష్మి కారును ఆపించుకుని దిగిపోయారు. అయితే, కొద్దిసేపటి తర్వాత మెడలోని మూడు తులాల సరుడు కనిపించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రజలు అపరిచిత వాహనాలలో ఎక్కకూడదని, తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

దర్యాప్తులో బి కోడూరు పోలీసులు, గోపవరం ఎస్సై శ్రీకాంత్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌బీ జయరామిరెడ్డి పాల్గొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముఠా గుట్టును రట్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

bhogapuram international airport nearing inauguration in andhra pradesh

భోగాపురం విమానాశ్రయం రెడీ.. ప్రధాని మోడీ చేతుల మీదుగా? కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్...
- Advertisement -
Chat on WhatsApp