Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaRangareddyచిలుకూరు ప్రధానార్చకుడు దాడి కేసులో కీలక విచారణ

చిలుకూరు ప్రధానార్చకుడు దాడి కేసులో కీలక విచారణ

-

Chat on WhatsApp

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిందితులు రామరాజ్య స్థాపన కోసం రంగరాజన్ ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్ పెట్టారని తెలిపారు. ఆ డిమాండ్ ను ఆయన తిరస్కరించడంతో దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈనెల 7వ తేదీన వీరరాఘవరెడ్డి తన 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటిపై దాడి చేశారని తెలిపారు.

ఈ దాడిలో రంగరాజన్ కుమారుడిని కూడా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

అరెస్టైన నిందితులను రిమాండ్ కు పంపించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితులలో కొందరు ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామని, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Crowd at Puri Jagannath Rath Yatra after a stampede incident in Odisha

Puri Jagannath Rath Yatra | జగన్నాథుడి రథయాత్రలో విషాదం.. 120 మందికి పైగా...

ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra) సందర్భంగా దుర్ఘటన చోటుచేసుకుని భక్తుల్లో విషాదాన్ని నింపింది. రథయాత్రను వీక్షించేందుకు భక్తులు పోటెత్తడంతో రద్దీ అదుపుతప్పి తొక్కిసలాట ఏర్పడింది. ఈ...
- Advertisement -
Chat on WhatsApp