Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeTelanganaRangareddyచిలుకూరు ప్రధానార్చకుడు దాడి కేసులో కీలక విచారణ

చిలుకూరు ప్రధానార్చకుడు దాడి కేసులో కీలక విచారణ

-

Chat on WhatsApp

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై జరిగిన దాడికి సంబంధించి రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, నిందితులు రామరాజ్య స్థాపన కోసం రంగరాజన్ ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్ పెట్టారని తెలిపారు. ఆ డిమాండ్ ను ఆయన తిరస్కరించడంతో దాడికి పాల్పడ్డారని వివరించారు. ఈనెల 7వ తేదీన వీరరాఘవరెడ్డి తన 20 మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటిపై దాడి చేశారని తెలిపారు.

ఈ దాడిలో రంగరాజన్ కుమారుడిని కూడా గాయపరిచారని పోలీసులు వెల్లడించారు. చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

అరెస్టైన నిందితులను రిమాండ్ కు పంపించినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నిందితులలో కొందరు ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామని, ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Chandrababu Naidu | పట్టిసీమ లేకుంటే కృష్ణా డెల్టా పరిస్థితి దారుణం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu: రాష్ట్రంలో సాగునీటి రంగాభివృద్ధికి కేఎల్ రావు చూపిన మార్గమే ఆదర్శమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా-గోదావరి(Krishna- Godavari) సంగమ క్షేత్రంలో ప్రత్యేక పూజలు...
- Advertisement -
Chat on WhatsApp