Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadశంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

-

Chat on WhatsApp

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి గురువారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ భద్రతా సిబ్బంది, పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ పోర్ట్ లో క్షుణ్ణమైన తనిఖీలు చేపట్టారు.

పోలీసులు మరియు భద్రతా సిబ్బంది గంటల తరబడి ఏరియాలోని ప్రతి వాహనాన్ని, అరైవల్, డిపార్చర్ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని తనిఖీ చేశారు. బాంబు స్క్వాడ్ ను కూడా రప్పించి విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా గాలించారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల దర్యాఫ్తులో, కమారెడ్డి జిల్లాకు చెందిన నితిన్ అనే యువకుడు ఈ బెదిరింపు కాల్ చేశాడని గుర్తించారు. నితిన్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అతడికి మతిస్థిమితం లేదని తేలింది. దీంతో నితిన్ కుటుంబ సభ్యులను పిలిపించి అతడిని అప్పగించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp