Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeNationalమ‌హా కుంభమేళా తొక్కిస‌లాట - 30 మంది మృతులు

మ‌హా కుంభమేళా తొక్కిస‌లాట – 30 మంది మృతులు

-

Chat on WhatsApp

ప్ర‌యాగ‌రాజ్‌లోని మ‌హా కుంభ‌మేళాలో జరిగిన తొక్కిసలాట దుర్ఘ‌ట‌న దేశవ్యాప్తంగా షాక్ ఇచ్చింది. బుధవారం తెల్లవారుజామున మౌని అమావాస్య సంద‌ర్భంగా కోట్లాది భ‌క్తులు సంగం ఘాట్ వ‌ద్ద త‌ర‌లివ‌స్తున్న సమయంలో ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇందులో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డవారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై యూపీ సర్కారు నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌స్తావిస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. విశాల్ తివారీ అనే న్యాయ‌వాది ఈ పిటిష‌న్ వేయ‌డం జ‌రిగింది. పిటిష‌న్‌లో రాష్ట్రాల‌కు స్ప‌ష్ట‌మైన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చేలా సుప్రీంకోర్టును కోరారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల నుంచి భ‌క్తుల భ‌ద్ర‌త‌కు సాంకేతిక ప‌రిష్కారాలు అందించాల‌ని పిటిష‌న‌ర్ సూచించారు.

ప్ర‌తిపక్షాలు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వ నిర్ల‌క్ష్యంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. దీనితో యూపీ సర్కారు, అధికారులు భ‌క్తుల భ‌ద్ర‌త కోసం ప‌లు చర్య‌లు చేప‌ట్టాలని యోచిస్తున్నార‌న్న ప్ర‌తిస్పంద‌న‌లు ఉన్నాయి. వీఐపీల క‌దలిక‌ల‌ను కంట్రోల్ చేసేలా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని కూడా పిటిష‌న్‌లో పేర్కొన‌డం గమనార్హం.

మ‌హా కుంభమేళా 45 రోజుల పాటు సాగ‌నున్న ఈ ఏడాది, ప్ర‌స్తుతం 27 కోట్ల మంది భ‌క్తులు ప‌విత్ర స్నానాలు ఆచ‌రించారు. ఫిబ్ర‌వ‌రి 26 వ‌ర‌కు ఈ మేళా సాగ‌నుంది. 40 కోట్ల మంది స‌న్నిహితులందరూ పాల్గొన‌వ‌చ్చ‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

The Tatas Web Series | వ్యాపార దిగ్గజం టాటా కుటుంబ చరిత్రతో కొత్త...

The Tatas Web Series: భారత పారిశ్రామిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన టాటా కుటుంబం జీవిత ప్రయాణం త్వరలో వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకులను అలరించనుంది. దేశ నిర్మాణంలో కీలక పాత్ర...
- Advertisement -
Chat on WhatsApp