Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeNationalభోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 ఏళ్లు, వ్యర్థాలు తొలగింపు

భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 ఏళ్లు, వ్యర్థాలు తొలగింపు

-

Chat on WhatsApp

భోపాల్ లో 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి నుండి 3,800 మంది ప్రాణాలు కోల్పోయిన గ్యాస్ లీక్ దుర్ఘటనకు 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ సమయంలో యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో లీకైన విష వాయువు నగరాన్ని దాటి సమీప ప్రాంతాలకి వ్యాపించింది. ఈ విషవాయువు కారణంగా భోపాల్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అక్కడి ప్రజలపై దీని దుష్ప్రభావాలు కొనసాగుతూనే ఉన్నాయి, చాలా మంది శారీరకంగా బాధపడుతున్నారు.

ఈ దుర్ఘటనకు సంబంధించిన విష రసాయన వ్యర్థాలను యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ ఆవరణలో జాగ్రత్తగా నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ వ్యర్థాలను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఆవరణలోని 377 టన్నుల వ్యర్థాలను తొలగించి పిథంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాకు తరలించడం మొదలు పెట్టారు. ఈ వ్యర్థాలను ఇంజనీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో ధ్వంసం చేయాలని అధికారులు నిర్ణయించారు.

బుధవారం రాత్రి, విషపూరిత రసాయన వ్యర్థాలను 12 సీల్డ్ కంటైనర్లలో లోడ్ చేసి, వంద మంది కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేశారు. అనంతరం వీటిని 250 కిలోమీటర్ల దూరంలోని పిథంపూర్ కు తరలించారు. ట్రాఫిక్ పోలీసుల సహాయంతో ఈ వ్యర్థాలను జాగ్రత్తగా తరలించే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయబడింది.

పిథంపూర్ లో ఈ వ్యర్థాలను ధ్వంసం చేయడం 153 రోజులు పడుతుందని అధికారుల అంచనా. ఈ చర్యలు ఫ్యాక్టరీ ప్రాంతంలో ఉన్న ప్రమాదకరమైన వ్యర్థాలను తగిన విధంగా తొలగించి భోపాల్ ప్రజలకి ఒక నివారణను అందిస్తాయని భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana Chief Minister Revanth Reddy speaking about HYDRA

Revanth Reddy | కబ్జాకోరులకు సీఎం వార్నింగ్.. హైడ్రా విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదు

Revanth Reddy: హైడ్రా(HYDRA) వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణల్లో హైడ్రా ఒకటని పేర్కొంటూ,...
- Advertisement -
Chat on WhatsApp