Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeInterNational16 ఏండ్ల బాలిక 7 అత్యున్నత పర్వతాలు అధిరోహించి ప్రపంచ రికార్డు

16 ఏండ్ల బాలిక 7 అత్యున్నత పర్వతాలు అధిరోహించి ప్రపంచ రికార్డు

-

Chat on WhatsApp

ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక కామ్యా కార్తికేయన్‌ పర్వతారోహణలో ప్రపంచ రికార్డు సాధించింది. ఏడు ఖండాలలోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించిన కామ్యా, సప్త పర్వతాధిరోహణ సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.

ఈ సవాల్‌లో భాగంగా కామ్యా, ఆఫ్రికాలోని మౌంట్‌ కిలిమంజారో, యూరప్‌లోని మౌంట్‌ ఎల్‌బ్రస్, ఆస్ట్రేలియాలోని మౌంట్‌ కాజీయాస్కో, దక్షిణ అమెరికాలోని మౌంట్‌ అకాన్‌కాగువా, ఉత్తర అమెరికాలోని మౌంట్‌ డెనాలి, ఆసియాలోని మౌంట్‌ ఎవరెస్ట్‌, ఆంటార్క్టికాలోని మౌంట్‌ విన్సన్‌ను విజయవంతంగా అధిరోహించింది.

తన తండ్రి కమాండర్‌ కార్తికేయన్‌తో కలిసి మౌంట్‌ విన్సన్‌ను చేరుకున్న కామ్యా, డిసెంబర్‌ 24న ఈ సవాల్‌ను పూర్తిచేసింది. ప్రస్తుతం ముంబైలోని నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న కామ్యా, తన ఈ ఘనతతో దేశం ప్రతిష్టను పెంచింది.

భారతీయ నేవీ కమాండర్‌ కార్తికేయన్‌ తన కుమార్తెను అభినందించారు. తన తదుపరి లక్ష్యంగా ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం చేరుకోవాలని కామ్యా నిర్దేశించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Air India AI-171 crash investigation officials examining aircraft wreckage

Ahmedabad Crash Investigation | ఎయిరిండియా AI-171 ప్రమాదంపై కేంద్రం క్లారిటీ.. కేంద్రం కీలక...

Ahmedabad Crash Investigation: ఎయిరిండియా AI-171 విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన ప్రతి సాంకేతిక అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, తుది...
- Advertisement -
Chat on WhatsApp