Friday, March 20, 2026
No menu items!
spot_img
HomeFilms Newsసన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నుంచి రూ.1,000 సాయం!

సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నుంచి రూ.1,000 సాయం!

-

ప్రసిద్ధ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలవారీగా రూ.1,000 అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహతారి వందన యోజన’ పథకంలో సన్నీ లియోన్ కూడా లబ్దిదారుగా ఎంపిక చేయబడింది. సన్నీ లియోన్ పేరు, ఫొటోలు రికార్డులలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పథకంలో భాగంగా సన్నీ లియోన్ కు నెలవారీగా రూ.1,000 జమ అవుతున్నా, ఇది అవినీతికి సంకేతంగా పేర్కొనబడింది. పథకం కింద వివాహిత మహిళలకు ఈ సాయం అందజేస్తోంది, కానీ సన్నీ లియోన్ పేరు ఎలా జాబితాలో చేరింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో దరఖాస్తు పరిశీలన లేకుండా, ఆమె పేరు జాబితాలో చేరిందని అధికారులు అంగీకరించారు.

బస్తర్ రీజియన్ లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది. గ్రామస్థుడు వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఛత్తీస్ గఢ్ లోని బీజేపీ ప్రభుత్వం ‘మహతారి వందన యోజన’ పేరిట వివాహిత మహిళలకు రూ.1,000 సాయం అందజేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ పథకంపై తీవ్రమైన విమర్శలు చేస్తోంది. అవినీతికి అవకాశం కల్పించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని, ‘మహతారి వందన యోజన’ లబ్దిదారుల్లో సగం మందికి పైగా ఫేక్ అని ఆరోపిస్తోంది. ఈ తాజా ఘటన కూడా దీనికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

- Advertisement -
- Advertisment -

Must Read

revanth reddy attending gaddar film awards event at hitex hyderabad

హైటెక్స్‌లో గద్దర్ అవార్డ్స్.. ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉగాది సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.