Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeFilms Newsసన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నుంచి రూ.1,000 సాయం!

సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ నుంచి రూ.1,000 సాయం!

-

Chat on WhatsApp

ప్రసిద్ధ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలవారీగా రూ.1,000 అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహతారి వందన యోజన’ పథకంలో సన్నీ లియోన్ కూడా లబ్దిదారుగా ఎంపిక చేయబడింది. సన్నీ లియోన్ పేరు, ఫొటోలు రికార్డులలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పథకంలో భాగంగా సన్నీ లియోన్ కు నెలవారీగా రూ.1,000 జమ అవుతున్నా, ఇది అవినీతికి సంకేతంగా పేర్కొనబడింది. పథకం కింద వివాహిత మహిళలకు ఈ సాయం అందజేస్తోంది, కానీ సన్నీ లియోన్ పేరు ఎలా జాబితాలో చేరింది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంలో దరఖాస్తు పరిశీలన లేకుండా, ఆమె పేరు జాబితాలో చేరిందని అధికారులు అంగీకరించారు.

బస్తర్ రీజియన్ లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది. గ్రామస్థుడు వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఛత్తీస్ గఢ్ లోని బీజేపీ ప్రభుత్వం ‘మహతారి వందన యోజన’ పేరిట వివాహిత మహిళలకు రూ.1,000 సాయం అందజేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈ పథకంపై తీవ్రమైన విమర్శలు చేస్తోంది. అవినీతికి అవకాశం కల్పించేలా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని, ‘మహతారి వందన యోజన’ లబ్దిదారుల్లో సగం మందికి పైగా ఫేక్ అని ఆరోపిస్తోంది. ఈ తాజా ఘటన కూడా దీనికి నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

landslide at tunnel construction site in wayanad kerala trapping workers

Wayanad | వయనాడ్‌లో మరోసారి విషాదం.. క్షణాల్లో కూలిన కొండ, శిథిలాల్లో కార్మికులు

కేరళలోని వయనాడ్(Wayanad) జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడిన ఘటన కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ ప్రాంతంలో తాజాగా భారీ వర్షాల కారణంగా మరో ప్రమాదం చోటుచేసుకుంది....
- Advertisement -
Chat on WhatsApp