Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఅన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథసేవ వైభవం

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథసేవ వైభవం

-

Chat on WhatsApp

కాకినాడ జిల్లా, అన్నవరం పుణ్యక్షేత్రంలో ప్రముఖమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో ఆదివారం ఉదయం 10 గంటలకు రథసేవ అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ అర్చకులు రథాన్ని పుష్పాలతో అలంకరించి, శ్రీ స్వామి అమ్మవార్లను రథంలో ఆశీనులు చేసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు నిర్వహించారు.

భక్తుల కోసం ప్రత్యేక సేవలను అందుబాటులో ఉంచారు. రథసేవలో పాల్గొనాలంటే, దంపతులు మరియు ఇద్దరు పిల్లలతో రూ. 2,500/- చెల్లించి సేవలు పొందవచ్చు. ఈ సేవలలో ఆంత్రాలయంలో స్వామి దర్శనం, శేష వస్త్రం, ప్రసాదం అందజేయడం జరుగుతుంది.

రథసేవ సందర్భంగా వేద పండితులు, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ రామ్మోహన్ రావు, సూపర్డెంట్లు ఐ.వి రామారావు, కంచి మూర్తి, సుబ్రహ్మణ్యం వంటి అధికారులు పాల్గొన్నారు.

గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి, ఉత్సవ వాతావరణంలో తళుక్కుమంది. ఈ కార్యక్రమం అన్నవరం ఆలయ మహాత్మ్యాన్ని మరోమారు ప్రపంచానికి చాటింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp