Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshబల్లగరువులో అభివృద్ధి పనులు ప్రారంభించిన పవన్

బల్లగరువులో అభివృద్ధి పనులు ప్రారంభించిన పవన్

-

Chat on WhatsApp

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బల్లగరువులో పర్యటించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రజలకు తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు తెలియజేశారు. ప్రజలు ఓట్లు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం వల్లే తాను ఈ సేవలు అందజేయగలుగుతున్నానని పవన్ అన్నారు.

“మాకు 164 అసెంబ్లీ సీట్లు, 21 ఎంపీ స్థానాలు ఇచ్చారు. ఈ విజయమే ప్రజలకు మేలుచేసే అవకాశాన్ని కల్పించింది” అని తెలిపారు. అభివృద్ధి పనులకు రూ.105 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాలు 4,500 మంది గిరిజనులకు లబ్ధి చేకూరుస్తాయని పేర్కొన్నారు.

పాత్రికేయుల అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, “మాకు ఓట్లు వేయని ప్రజలకోసం కూడా మేము పనిచేస్తాం. ఓట్లు కాదు, సంక్షేమమే మా లక్ష్యం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు దీనికి నిదర్శనం” అని పవన్ స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో ఆయన పంచాయతీ రాజ్ శాఖ చేపట్టిన పనులను ప్రశంసించారు. అధికారంలో ఉండటం వల్ల ప్రజలకు సేవ చేయడం సాధ్యమవుతుందని చెప్పిన పవన్, భవిష్యత్‌లో మరింత సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

suryakumar yadav clarifies fake statement viral on social media

Suryakumar Yadav | సోషల్ మీడియా ఫేక్ పోస్టులపై సూర్యకుమార్ ఆగ్రహం

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ పేరుతో వైరల్ అవుతున్న తప్పుడు పోస్టుపై క్రికెటర్ స్పందించి, అది తనకు సంబంధం లేని ప్రచారమని స్పష్టం చేశాడు. తనకు ఆ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని...
- Advertisement -
Chat on WhatsApp