Sunday, July 26, 2026
Chat on WhatsApp
HomeCrime Newsబెట్టింగ్ యాప్ ప్రచారంపై 11 మంది యూట్యూబర్లకు నోటీసులు

బెట్టింగ్ యాప్ ప్రచారంపై 11 మంది యూట్యూబర్లకు నోటీసులు

-

Chat on WhatsApp

బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన యూట్యూబ్ ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు. మొత్తం 11 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, విచారణను ముమ్మరం చేశారు. నోటీసులు అందుకున్న కొందరు విచారణకు హాజరు కావడానికి సమయం కోరగా, మరికొందరు ఇకపై బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయబోమని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. పోలీసులు ఇప్పటివరకు పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లను విచారించగా, ఇంకా మరికొందరి నుంచి వివరాలు సేకరించాల్సి ఉందని వెల్లడించారు. ఈడీ అధికారులు కూడా ఈ కేసును పరిశీలిస్తున్నారు.

ఈ వ్యవహారంలో నటి విష్ణుప్రియ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆమెకు ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ నుంచి నోటీసులు అందాయి. షూటింగ్ కారణంగా విచారణకు రాలేకపోయిన ఆమె, తాజాగా హాజరై విచారణను ఎదుర్కొన్నారు.

ఇంకా ఈ కేసులో మరికొందరు యూట్యూబ్ ప్రముఖులకు విచారణ నోటీసులు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పోలీసులు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp