Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshసుధీర్ భార్గవ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం

సుధీర్ భార్గవ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం

-

Chat on WhatsApp

వైద్య వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగి, సక్సెస్‌ఫుల్ డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి నేడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వైఎస్ఆర్సిపి అధినేత జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ఆయన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నిర్ణయంతో సత్తెనపల్లిలో రాజకీయంగా కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

నేడు సత్తెనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ శ్రేణుల మద్దతుతో, ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. వైద్య సేవల ద్వారా ప్రజలకు దగ్గరైన ఆయన, రాజకీయాల్లోనూ అదే నిబద్ధతను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇప్పటివరకు తెర వెనుక రాజకీయాల పరంగా గజ్జల బ్రహ్మారెడ్డి కుటుంబం ప్రభావం చూపినా, సుధీర్ భార్గవ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రంతో కొత్త మార్పు చోటు చేసుకోనుంది. సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల్లో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది. వైఎస్ఆర్సిపి బలోపేతానికి ఆయన కీలక పాత్ర పోషించనున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై సుధీర్ భార్గవ్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన తొలి లక్ష్యమని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఆయన, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలపరిచే దిశగా ముందుకెళ్లనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp