Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవిజయవాడ కొండచరియలు: సీఎం చంద్రబాబు సంతాపం, చర్యల ఆదేశం

విజయవాడ కొండచరియలు: సీఎం చంద్రబాబు సంతాపం, చర్యల ఆదేశం

-

Chat on WhatsApp

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ బాలిక చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారయంత్రాంగంతో శనివారం ఉదయం సమీక్ష నిర్వహించారు.

వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ జామ్ కాకుండా పరిస్థితికి అనుగుణంగా దారి మళ్లించాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలకు టెక్నాలజీ వాడుకోవాలని, వాట్సాప్ గ్రూపులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో డ్రోన్లను ఉపయోగించాలని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

oneplus n6 smartphone with 8000mah battery and 120hz display launched in india

చౌక ధరలో OnePlus N6.. ఫీచర్లు చూస్తే షాక్, పూర్తి స్పెక్స్, ధర వివరాలు

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త దూకుడు చూపిస్తూ OnePlus తన ‘N’ సిరీస్‌లో తొలి మోడల్‌ను అధికారికంగా విడుదల చేసింది. OnePlus N6 పేరుతో వచ్చిన ఈ డివైస్ బడ్జెట్ విభాగంలోనే భారీ బ్యాటరీ,...
- Advertisement -
Chat on WhatsApp