Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaరోడ్డు భద్రతపై అవగాహన.. హెల్మెట్ తో బైక్ ర్యాలీ!

రోడ్డు భద్రతపై అవగాహన.. హెల్మెట్ తో బైక్ ర్యాలీ!

-

Chat on WhatsApp

రోడ్డు ప్రయాణాల సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాలను నివారించాలని వరంగల్ రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా వరంగల్ రవాణా శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

నాయుడు పంపు జంక్షన్ వద్ద 200 మంది ఫోర్త్ బెటాలియన్ పోలీసులతో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ తప్పనిసరి అని, ప్రతి ఒక్కరూ రక్షణ చర్యలు పాటించాలని అధికారులు తెలిపారు.

రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని హెచ్చరించారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలు సహకరించాలని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp