Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshపుసులూరు గ్రామంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా

పుసులూరు గ్రామంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా

-

Chat on WhatsApp

పెదనందిపాడు మండలం పుసులూరు గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూలులో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాగులతో చేసిన పిండివంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

జావ వంటి రాగులతో తయారైన పదార్థాలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఐరన్ శాతం పెరుగుతుందని టీచర్లు వివరించారు. ఆకుకూరలు, చిరుధాన్యాలు, పప్పు, కూరగాయలతో ఆహారం తీసుకోవడం వల్ల పోషకాహార లోపం నివారించవచ్చని తెలిపారు.

బయట నుంచి తెచ్చుకున్న న్యూడిల్స్ వంటి పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి హానికరమని, ఇంట్లో తయారుచేసిన పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిదని సూచించారు.

టీచర్ కె. అన్నపూర్ణ మాట్లాడుతూ, పోషకవిలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.

పోషకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి అనే సందేశంతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు అందులో పాల్గొన్నారు.

హైస్కూల్ హెచ్ఎం ఎన్. రాంబాబు, ఏఎన్ఎం లూదుమేరీ, మహిళా పోలీస్ వి. సుజిత, ఎంఎల్‌హెచ్‌పీ లెనోరా క్వీన్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

andhra pradesh government to conduct mudragada padmanabham last rites with state honours

Mudragada Padmanabham | ముద్రగడ సేవలకు గౌరవ వందనం.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham)కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ప్రజా జీవితంలో అందించిన సేవలకు...
- Advertisement -
Chat on WhatsApp