నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్

నెమ్మదిగా సాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  పోలింగ్ NOVEMBER 11 ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభ రెండు గంటల్లో ఓటింగ్ నెమ్మదిగా సాగింది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున వందమంది వరకు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

పోలింగ్ వేగం నెమ్మదిగా ఉన్నప్పటికీ, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉన్నందున, మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరగొచ్చని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

వెంగళ్‌రావు నగర్ డివిజన్‌లో శాంతియుతంగా కొనసాగుతున్న ఓటింగ్

వెంగళ్‌రావు నగర్ డివిజన్‌లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. అక్కడ 54,620 మంది ఓటర్ల కోసం మొత్తం 54 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ALSO READ:దిల్లీ ఎర్రకోట పేలుడు వెనుక ఉగ్ర కుట్ర.. కశ్మీర్‌ డాక్టర్‌పై అనుమానాలు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఓటింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. చాలా కేంద్రాల్లో ఓటర్లు క్రమంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు.

మొదటిసారి ఓటు వేస్తున్న యువతలో ఉత్సాహం

ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేస్తున్న యువతలో ఉత్సాహం కనిపిస్తోంది. తమ ఓటు హక్కు వినియోగించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా, ఉదయం కొంత నిదానంగా ప్రారంభమైన జూబ్లీహిల్స్ పోలింగ్, మధ్యాహ్నానికి వేగం పుంజుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *