Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeNationalకశ్మీర్‌లో వరుస భూకంపాలు. భయభ్రాంతులకు గురైన ప్రజలు

కశ్మీర్‌లో వరుస భూకంపాలు. భయభ్రాంతులకు గురైన ప్రజలు

-

Chat on WhatsApp

రెండు వరుస భూకంపాలతో మంగళవారం కశ్మీర్ లోయ ఉలిక్కిపడింది. ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపైకి చేరారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు రాలేదు. తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కేంద్రం బారాముల్లా జిల్లాలో భూమికి 5 కిలోమీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. మరో 7 నిమిషాల వ్యవధిలోనే అంటే సరిగ్గా 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూంకంపం సంభవించింది. దీని కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలోనే భూమికి 10 కిలోమీటర్ల లోతున గుర్తించారు. 

రెండు వరుస భూకంపాలు సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారాల గురించి వాకబు చేయడంతో ఫోన్ లైన్లు అన్నీ బిజీగా మారిపోయాయి. 8 అక్టోబర్ 2005లో ఇక్కడ 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి 80 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

donald trump birthright citizenship executive order us supreme court ruling

Birthright Citizenship | ట్రంప్‌కు షాక్.. అమెరికాలో పుట్టిన పిల్లల పౌరసత్వంపై సుప్రీంకోర్టు కీలక...

Birthright Citizenship: అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం కల్పించే 'బర్త్‌రైట్ సిటిజన్‌షిప్' నిబంధనపై కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు న్యాయపరమైన సవాళ్లు ఎదురవడంతో, అమెరికా...
- Advertisement -
Chat on WhatsApp