Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeNationalకర్ణాటకలో రోడ్డు ప్రమాదం – నలుగురు తెలంగాణ వాసుల మృతి

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – నలుగురు తెలంగాణ వాసుల మృతి

-

Chat on WhatsApp

కర్ణాటక రాష్ట్రంలోని హల్లిఖేడ్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాను, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు అక్కడికక్కడే మృతి చెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్‌ (40), రాచప్ప‌ (45), కాశీనాథ్‌ (60), నాగరాజు‌ (40)గా పోలీసులు గుర్తించారు.సమాచారం ప్రకారం, వీరంతా గణగాపూర్‌ దత్తాత్రేయ ఆలయ దర్శనం ముగించుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో ఉన్నారు.


ఈ క్రమంలో హల్లిఖేడ్‌ సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాను వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఢీకొన్న వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాదం తీవ్రతతో అక్కడి దారిలో వచ్చినవారు భయాందోళనకు గురయ్యారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp