అత్తాపూర్లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడి ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఆకస్మికంగా పేలింది. ఈ ఘటనలో అతని తొడకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల రాయచోటి మరియు ఉత్తరప్రదేశ్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం కలవరపరిచే విషయం. నిపుణుల కథనం ప్రకారం, ఓవర్హీటింగ్ (Overheating) కారణంగానే ఈ తరహా ఫోన్ పేలుళ్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. మొబైల్ ఫోన్లను చార్జింగ్లో ఉంచి వాడకూడదని, వేడిచేసే ప్రదేశాల్లో ఉంచరాదని, తక్కువ నాణ్యత గల ఛార్జర్లు, బ్యాటరీలు వాడకూడదని వారు సూచిస్తున్నారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని, భద్రతా సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అత్తాపూర్లో యువకుడి జేబులో ఫోన్ పేలుడు
