Sunday, February 22, 2026
No menu items!
spot_img
HomeTelanganaMedakనార్సింగి గ్రామంలో నివారించని చెత్తఫై ప్రజల ఆవేదన

నార్సింగి గ్రామంలో నివారించని చెత్తఫై ప్రజల ఆవేదన

నార్సింగి గ్రామంలోని 5-7 వార్డుల్లో మురికి కంపుతో, పెంట గుంతలు నిండి ప్రజలు దోమల వల్ల వ్యాధులతో బాధపడుతున్నారు. వర్ష కాలంలో సమస్యలు ఎక్కువయ్యాయి.

గ్రామ పంచాయతీ అధికారులు పరిశుభ్రతపై చర్యలు తీసుకోకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమల ప్రబలడం వల్ల ప్రజలకు డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు వస్తున్నాయి.

చెత్త బండీ రావట్లేదని 7వ వార్డు ప్రజలు చెప్పగా, గతంలో కూడా పంచాయతీ కార్యదర్శికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని వాపోయారు.

ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు సూచించినా, గ్రామంలో పనులు పూర్తిగా నిర్వహించకుండానే ముగించారని ఆరోపణలు ఉన్నాయి.

సొంత స్థలాల్లో ఇళ్లు ఉన్నప్పటికీ పట్టణాల్లో నివసించే ప్రజల స్థలాల్లో పిచ్చి మొక్కలు వ్యాపించి, దోమల ప్రబలంతో చుట్టుపక్కల ఇళ్లలో వ్యాధులు వ్యాపిస్తున్నాయి.

ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు ప్రవేశపెట్టినా, నార్సింగి గ్రామంలో ఆ కార్యక్రమాలు కనుమరుగయ్యాయని స్థానికులు తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని, వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత అధికారులు గ్రామస్తుల సమస్యలపై స్పందించి, పరిశుభ్రత కల్పించాలని, ప్రజలకు ఆరోగ్య రక్షణ అందించాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular