Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaNirmalనిర్మల్ జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

నిర్మల్ జిల్లాలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

-

Chat on WhatsApp

తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో నిరవధిక సమ్మె కొనసాగుతోంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ఈ సమ్మెకు ఈరోజు 11 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు రోడ్లు ఊడుస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వ స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగులు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు తమ సమస్యలను పరిష్కరించలేకపోయాయని, అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ దీక్షా శిబిరానికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తామనే హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమను రెగ్యులరైజ్ చేస్తామని, ఆదేశాలు ఇస్తామని అన్నారు.

ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు, ప్రాథమిక అవసరాల గురించి చర్చించారు. పెండింగ్ జీతాలు, నిత్యావసరాల పెరుగుతున్న ధరల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 2004లో ప్రారంభమైన కేజీబీవీ పథకం కింద 20 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం తమ సమస్యలపై స్పందించి, ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తారని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మెతో తమ ధృడతను చాటుకుంటూ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nothing Phone 4b

Nothing Phone 4b లాంచ్.. 6000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ప్రత్యేక డిజైన్‌తో గుర్తింపు పొందిన Nothing సంస్థ మరో కొత్త డివైస్‌ను పరిచయం చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా 'B' సిరీస్‌లో భాగంగా Nothing Phone 4bను విడుదల...
- Advertisement -
Chat on WhatsApp